మూడు రాజధానులు కట్టమని ఎవరూ అడగలేదు

yanamala ramakrishnudu
yanamala ramakrishnudu

అమరావతి: మూడు రాజధానులు కట్టమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఎవరూ అడగలేదని టిడిపి నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అయినప్పటికీ మూడు రాజధానులు అంటూ సీఎం సొంతంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఈ రోజు యనమల మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సిపి నేతలు విశాఖపట్నంలో భూ కబ్జాలు మొదలు పెట్టారని యనమల ఆరోపించారు. అధికార పార్టీ వారు ఎవరు భూములు కొంటున్నారు? ఎవరెవరు కబ్జాలు చేసున్నారు? నాయకుల స్వార్థంతో రాజధానిని, హైకోర్టును మార్చాలని నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఇటువంటి సమయంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని యనమల మండిపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/