యూపీలో ఆ జిల్లాల్లో లాక్‌డౌన్ అవసరం లేదు

సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court
Supreme Court

lucknow: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో తాత్కాలిక లాక్‌డౌన్‌ను ఆయా ప్రభుత్వాలు విధించాయి. ఇదిలా ఉండగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అలహాబాద్ హైకోర్టు ఐదు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించాలని యోగి సర్కార్‌ను ఆదేశించింది. ఈ తీర్పును యూపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. లాక్‌డౌన్ అవసరం లేదని, కరోనా వ్యాప్తి తగ్గుదలకు యూపీ ప్రభుత్వం పకడ్భందీ చర్యలు చేపట్టాలని సూచించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/