తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు

శాసన సభలో సీఎం కెసిఆర్ వెల్లడి

TS CM KCR
TS CM KCR

Hyderabad: ‌తెలంగాణ‌లో మళ్ళీ లాక్‌డౌన్ విధించటం ఉండదని ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌క‌టించారు. శాస‌న‌స‌భ‌లో ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ,. లాక్‌డౌన్ పెట్టబోమ‌ని, ప‌రిశ్ర‌మ‌ల మూసివేత ఉండ‌ద‌న్నారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.

మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తే క‌రోనాను నియంత్రించ‌వ‌చ్చ‌ని,. విద్యార్ధులు క‌రోనా భారీన ప‌డుతుండ‌టంతో బాధ‌తోనే స్కూళ్ల‌ను తాత్కాలికంగా మూసివేశామ‌ని స్ప‌ష్టం చేశారు. మళ్ళీ విద్యా సంస్థ‌ల‌ను తెరిచే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొన్నారు

సినిమా థియేట‌ర్ల యాజమాన్యాల‌కు కొన్ని వెసులుబాట్లు క‌ల్పించి… కేంద్రం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా థియేట‌ర్ల‌ను ఓపెన్ చేశామ‌ని గుర్తు చేశారు. క‌రోనా వ‌ల్ల మ‌నం ఒక్క‌ర‌మే కాద‌ని, ప్ర‌పంచంలోని అనేక దేశాలు చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయ‌న్నారు.

క‌రోనా దెబ్బ‌కు అన్ని దేశాల జీడీపీలు కుప్ప‌కూలాయ‌ని, అయినా తెలంగాణ‌ రాష్ట్రం జీడీపీలో మ‌నం మెరుగ్గా ఉంద‌ని పేర్కొన్నారు. 10.85 ల‌క్ష‌ల మందికి వ్యాక్సినేష‌న్ ఇచ్చామ‌ని చెప్పారు..

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/