ఆర్సిబి ని వదిలివెళ్లే ఆలోచన లేదు
డివిలియర్స్తో ఇన్స్టాగ్రామ్ లైవ్లో కోహ్లీ వెల్లడి
ఢిల్లీ: కరోనా కారణంగా ఇంటికే పరిమితమయిన క్రిడాకారులు ఇన్స్టాగ్రామ్ లైవ్లో పాల్గోంటున్నారు. తాజాగా ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాప్రికా క్రికెటర్ ఏబి డివిలియర్స్ తో కలిసి లైవ్లో మాట్లాడాడు. ఈ సందర్బంగా కోహ్లీ మాట్లాడుతు..ఆర్సిబితో ప్రయాణం ఓ అద్బుతం. ఐపిఎల్ కప్ను సాధించడం మా కల. అయితే ఇప్పటి వరకు బాగా రాణించలేక పోయామనే భాధ ఉండొచ్చు కాని ఆర్సిబి జట్టు నుంచి వెళ్లే ఆలోచన తనకు లేదంటు కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐపిఎల్ లోకి వచ్చే యువకులు పరుగుల వరద పారించాలని కోహ్లీ సూచించాడు. ఇదే సందర్బంగా గత తోమ్మిది సీజన్ల నుంచి కొనసాగుతూన్న డివిలియర్స్ కూడా ఆర్సిబిని ఎప్పటికి విడిచి వెళ్లనని తెలిపాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/