యూపిలో బంగారం గనులు అవాస్తవం

జిల్లాలో అలాంటి బంగారం నిల్వలను గుర్తించలేదన్న జిఎస్‌ఐ

Gold Mine
Gold Mine

ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌ లోని సోన్‌ భద్ర జిల్లాలో 3వేల టన్నుల బంగారం నిల్వలు వెలుగులోకి వచ్చాయంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని జీఎస్ఐ (జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) అధికారి ఒకరు తెలిపారు. అసలు ఆ జిల్లాలో తాము అంత బంగారం నిల్వలను గుర్తించనే లేదని జీఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎం శ్రీధర్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మీడియాకు తాము సమాచారం కూడా ఇవ్వలేదని కోల్‌ కతాలో తెలిపారు. అయితే, ఇదే జిల్లాలో జీఎస్ఐ సుమారు 52 వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని గుర్తించిందని, అందులో టన్నుకు 3.03 గ్రాముల బంగారం ఉందని తేలిందని, ఇది అత్యంత సాధారణ స్థాయని అన్నారు. ఈ సమాచారాన్నే సోన్‌ భద్ర జిల్లా అధికారులు మరోలా ఊహించి వుండవచ్చని అంచనా వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/