సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట

జూలై 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు..హైకోర్టు

Sachin Pilot

జైపూర్‌: రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. జూలై 24 వరకు అనర్హతపై ఎలాంటి చర్యలను తీసుకోవద్దని స్పీకర్ జోషిని ఆదేశించింది. సచిన్ పైలట్ తరపున హైకోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ… స్పీకర్ జోషి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని చెప్పారు. పైలట్ తో పాటు 18 మంది ఎమ్మెల్యేలకు ఎలాంటి కారణం లేకుండానే నోటీసులు జారీ చేశారని అన్నారు. నోటీసులకు మూడు రోజుల్లోనే సమాధానం చెప్పాలని గడువు విధించారని… దీన్ని బట్టే స్పీకర్ అంతరంగం ఏమిటో అర్థమవుతోందని చెప్పారు. రోహత్గి వాదనతో ఏకీభవించిన కోర్టు జూలై 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పీకర్ ను ఆదేశించింది. ఇటీవల రాజస్థాన్ సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలట్ తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. దీంతో, వారందరికి స్పీకర్ అనర్హత నోటీసులు ఇచ్చారు.  వీటిని సవాల్ చేస్తూ సచిన్ పైలట్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/