బురుండీ దేశాధ్యక్షుడు కురుంజిజా కరోనా తో మృతి ?!

ఇటీవలే కురుంజిజా భార్యకు కరోనా పాజిటివ్

Nkurunziza (file)

బురుండీ దేశాధ్యక్షుడు ఎన్. కురుంజిజా మరణించారు. ఆయన వయసు 55 సంవత్సరాలు.శనివారం ఆసుపత్రిలో చేరిన ఆయన కోలుకున్నారని వైద్యులు తెలిపారు . అయితే బుధవారం ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు చెబుతున్నా ఆయన కరోనా కాటుకు బలయ్యారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఎందుకంటే ఇటీవలే కురుంజిజా భార్యకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె కెన్యాలోని ఆగాఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కురుంజిజా మృతికి కరోనాయే కారణమై ఉంటుందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/