‘‘నేడు మీరు ఎక్కడకు వెళ్లారు నితీశ్ జీ? ఏం చేస్తున్నారు?: రవిశంకర్

నితీశ్ జీ, ప్రధాని పోస్ట్ ఖాళీగా లేదు.. క్యూలో నించోవాల్సిందే.. బిజెపినేత రవిశంకర్ ప్రసాద్

Ravi Shankar Prasad
Ravi Shankar Prasad

న్యూఢిల్లీః బీహార్‌ సిఎం నితీశ్ కుమార్.. సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. దీంతో నితీశ్ కుమార్ నైతిక విలువలను బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. నితీశ్ కుమార్ తన వ్యక్తిగత ఆకాంక్షల మాదిరే బీహార్ అభివృద్ధికి చురుగ్గా పని చేస్తే బీహారీ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మొదటిసారిగా పనిచేసిన రామ్ మనోహర్ లోహియా అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిగా నితీశ్ కుమార్ ను పేర్కొంటూ.. ‘‘నేడు మీరు ఎక్కడకు వెళ్లారు నితీశ్ జీ? నేడు ఏం చేస్తున్నారు? ప్రతి డోర్ ను తడుతున్నారు. ఇందులో కొత్తేమీ లేదు. మీకంటే ముందు చాలా మంది ఇదే పనిచేశారు. ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదు. ఎంతో మంది ప్రతిపక్ష నేతలు క్యూలో ఉన్నారు. మీరు కూడా నించోవాల్సిందే’’ అంటూ మంత్రి ప్రసాద్ ట్వీట్ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/