నడవలేని స్థితిలో నిత్యా మీనన్..

ఆలా మొదలైంది ఫేమ్ నిత్యా మీనన్ నడవలేని స్థితిలో కనిపించడం అందర్నీ షాక్ కు గురి చేసింది. అసలు ఏమైంది ఈమెకు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన నిత్యా…తెలుగు లో నందిని రెడ్డి డైరెక్షన్లో నాని హీరోగా నటించిన ఆలా మొదలైంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. మొదటి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకునే ఈమె..ఆ ఆతర్వాత వరుస ఛాన్సులతో మెప్పించింది.

ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ మూవీ లో కనిపించింది. ప్రస్తుతం సినిమాలు , వెబ్ సిరీస్ , లతో పాటు ఓటిటి సినిమాలు చేస్తుంది. తాజాగా నిత్య నటించిన వెబ్ సిరీస్ ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ జులై 8 నుంచి అమెజాన్ లో టెలికాస్ట్ కానుంది. ఈ క్రమంలో ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి ఇందులో నటించిన ఆర్టిస్టులంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో నిత్య మీనన్ స్టిక్ పట్టుకొని మరో ఇద్దరి సాయంతో నడిచింది. స్టేజిపైకి అలాగే వచ్చింది. దీంతో నిత్యాకి ఏమైంది అని అంతా కంగారు పడ్డారు. స్టేజి మీదకి వచ్చాక నిత్య మాట్లాడుతూ.. ”ఈ సిరీస్ లో ఇలాంటి క్యారెక్టర్ చేశాను. కానీ ఇప్పుడు నిజంగా జరిగింది. ఇటీవలే ఇంట్లో స్టెప్స్ మీద నుంచి స్లిప్ అయి పడ్డాను. దాంతో ఇలా జరిగింది” అని తెలుపడం తో అయ్యో అని అనుకున్నారు. నడవలేని పరిస్థితిలో కూడా ఇలా తాను నటించిన సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొనడంతో తన డెడికేషన్ ని మెచ్చుకుంటున్నారు.