అట్టహాసంగా నితిన్ కొత్త చిత్రం ప్రారంభం
వరుస హిట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న నితిన్..ఈరోజు ఆదివారం తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. నితిన్ 32 వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ ని నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట మూవీస్ లో తెరకెక్కుతుంది. ప్రముఖ రైటర్ వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాలో పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. హైదరాబాద్ లో జరిగిన మూవీ ఓపెనింగ్ కార్య క్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్రానికి అల్ ది బెస్ట్ తెలిపారు.
ఇక నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాతో జులై 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎమ్ఎస్. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నితిన్కు జోడిగా కృతిశెట్టి నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను , అభిమానులను ఆకట్టుకుంది.