కేంద్ర బడ్జెట్‌ 2021-22 కీలకాంశాలు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెడుతున్నారు. ‘నెవర్ బిఫోర్’ బడ్జెట్ ను ఈసారి ప్రవేశ పెడుతున్నట్టు ఈ సంద్భంగా ఆమె చెప్పారు.

బడ్జెట్‌ కీలకాంశాలు..

•ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచాం
•అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం
•లాక్‌డౌన్‌ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యంఇచ్చాం
•జల జీవన్‌ మిషన్‌కు రూ. 2,87,000 కోట్లు కేటాయింపు
•కోవిడ్‌19 వ్యాక్సినేషన్‌ కోసం రూ. 35,400 కోట్లు
•పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం
•వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ
•6 సంవత్సరాలకు గాను రూ. 64,180 కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం
•నేషనల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం, దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు
•ఆరోగ్య రంగానికి పెద్దపీట
•100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం
•కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం
•మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌
•కొత్తగా బీఎస్‌ఎల్‌3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు
•వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి
•రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు
•2 కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
•64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్‌
•రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

•రోడ్డు రవాణా, రహదారులకు రూ 1.18 లక్షల కోట్లు కేటాయించారు. రైల్వేలకు 1.10 లక్షల కోట్లు, ప్రజా రవాణాకు రూ. 18.000 కోట్లు కేటాయించామని బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే దిశగా బడ్జెట్‌లో పలు చర్యలు చేపట్టామని వివరించారు.


తాజా తెలంగాణ వార్తల కసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/