నా కూతురి మరణాన్ని అపహాస్యం చేయవద్దు
కన్నీళ్లతో రాజకీయ పార్టీలను వేడుకుంటున్నా: నిర్భయ తల్లి
న్యూఢిల్లీ: తన కూతురి మరణాన్ని అపహాస్యం చేయవద్దని కన్నీళ్లతో రాజకీయ పార్టీలను వేడుకుంటున్నానని నిర్భయ తల్లి ఆషాదేవి అన్నారు. నా కూతురిని చంపిన వారికి వేలకొద్దీ అవకాశాలు లభిస్తున్నాయి. కానీ మాకు ఏ హక్కులు లేవా? అని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో నేను ఇంతవరకు రాజకీయాల గురించి ఒక్కసారి కూడా మట్లాడలేదు. అయితే ఒక్క విషయం..2012లో ఎవరైతే నా కూతురి కోసం వీధుల్లోకి నిరసనలు చేశారో..ఈ రోజు వాళ్లే నా కూతురి చావును అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. 2014లో అధికారంలో వస్తే మహిళలపై దాడులు జరగవని చెప్పారు. రెండోసారి కూడా అధికారం చేపట్టి వేల కొద్దీ పనులు చేశారు. ట్రిపుల్ తలాక్ వంటి కీలక అంశాల్లో నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నా కూతురి విషయంలో కూడా త్వరగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకొవాలని బిజెపి ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇక నిర్భయ అత్యాచార నిందితుల్లో ఒకడైన ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/