నిర్భయ దోషులపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష పై ఏర్పడిన సందిగ్ధత పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్భయ దోషులకు మరోమారు ఉరిశిక్ష అమలు వాయిదా పడడంపై కేజ్రీవాల్ స్పందించారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని శిక్ష అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తుండడం దారుణమన్నారు. అత్యాచార కేసుల్లో దోషులకు ఆరు నెలల్లోపే కఠిన శిక్ష అమలయ్యేలా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. నిర్భయ దోషులకు మరణశిక్షను వాయిదా వేస్తూ నిన్న పాటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పింది. ఒకే కేసులో ఒకే శిక్ష పడిన దోషుల్లో ఏ ఒక్కరికి శిక్ష అమలు వాయిదా పడినా మిగిలిన వారికీ అది వర్తిస్తుంది. ఈ లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న నిర్భయ దోషులు శిక్ష అమలును వీలైనంత ఆలస్యం చేసేందుకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/