సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ దోషి!
అత్యాచారం జరిగిన సమయంలో ఢిల్లీలో లేనని సుప్రీంలో పిటిషన్
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరిశిక్ష సమయం దగ్గరపడుతుండడంతో దోషులు శిక్ష నుండి తప్పింకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా దోషులో ఒక్కరైనా ముకేశ్ సింగ్ అత్యాచార ఘటన జరిగిన సమయంలో తాను ఢిల్లీలోనే లేనని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ ఘటన డిసెంబరు 16న తాను ఢిల్లీలో లేనని పిటిషన్లో ముకేశ్ సింగ్ పేర్కొన్నారు. ఈసందర్భంగా తనకు మరణశిక్ష రద్దు చేయాలిని సుప్రీంకోర్టును కోరాడు. ఈవిషయంపై ఈరోజు మధ్యాహ్నం న్యాయస్థానం విచారించనుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/
: