నిర్భయ దోషి పవన్ గుప్తా రివ్యూ పిటిషన్
నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్నని ఇటీవల పవన్ పిటిషన్..
ఆ పిటిషన్ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ కేసులో దోషుల ఉరి శిక్ష వాయిదాకు ప్రయత్పాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో దోషి పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ వేశాడు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ అని వేసిన పిటిషన్ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ అతడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. తీర్పును పునఃసమీక్షించాలని, ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కోరాడు. నిర్భయ కేసులో ముగ్గురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ఇటీవలే డెత్ వారెంట్ ఇచ్చింది. దాని ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయాల్సి ఉంది. మరోవైపు, ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని, దోషులందరూ అన్ని న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకునేవరకు ఉరిశిక్ష అమలు చేయవద్దని కోరుతూ ఢిల్లీ కోర్టులో నిన్న దాఖలైన పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. ఈ పిటిషన్పై తమ స్పందన తెలియజేయాల్సిందిగా తిహార్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/