బీజేపీ పార్టీ నేతలకు అసలు సిగ్గు శరం ఉందా ? – నిరంజన్ రెడ్డి

వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి ..బిజెపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. యాసంగి లో వడ్ల కొనుగోలు గురించి మాట్లాడమంటే బీజేపీ నేతలు మాట్లాడరని నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు.. తెలంగాణ రైతులకు సమస్యగా మారారని.. రైతులు సంతోషంగా ఉంటే బీజేపీ కి సమస్యగా మారిందని మండిపడ్డారు. గత కొద్దీ రోజులుగా ధాన్యం కొనుగోలు విషయంలో తెరాస పార్టీ – బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో బండి సంజయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వెళ్లడం పట్ల నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతుల ధాన్యం పై గుండాల్లా దాడులకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు. కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు కాక మరేమీ ఉంటుందని… బీజేపీ డొల్ల తనం బయట పడిందన్నారు.

గతం లో కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని గుర్తు చేశారు. యూపీ, పంజాబ్ లో రైతులు ఆందోళన చేస్తున్నా మోడీ స్పందించరు కానీ ఇక్కడ రైతుల పేరిట బీజేపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణ రైతులకు మేము చేస్తున్న మెళ్లలో బీజేపీ పాత్ర శూన్యమన్నారు.