31న నిమ్మగడ్డ పదవీ విరమణ – తెరపైకి నీలం సాహ్ని పేరు !
పలువురు అధికారుల పేర్లు పరిశీలిస్తున్న ప్రభుత్వం
Amaravati: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది.. రాజ్యాంగబద్ద పదవిని వెంటనే భర్తీ చేయాలనే నిబంధనతో అందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సమాచారం..పలువురు విశ్రాంత ఐఎఎస్, ఐపిఎస్ ల పేర్లతో పాటు మాజీ న్యాయమూర్తుల పేర్లను పరిశీలిస్తున్నారు.. ఎన్నికల కమిషనర్ రేసులో ఎపి మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం ముఖ్యమంత్రి సలహదారు నీలం సాహ్నిపేరు ముందు వరుసలో ఉందని తెలుస్తోంది..
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/