ఏపీ గవర్నర్ తో ‘నిమ్మగడ్డ’ భేటీ
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు?!

Amaravati: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు.
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసిన నేపథ్యంలో ఎస్ఈసీ గవర్నర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రబుత్వం సహకరించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన గవర్నర్ ను కోరారు.
తాజా ‘మొగ్గ ‘ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/