ముగిసిన టీమిండియా బ్యాటింగ్..కీవిస్ టార్గెట్ 166
విల్లింగ్టన్: విల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కీవిస్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది. ఎంకె పాండే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో పాండే అత్యధిక పరుగులు చేశాడు. రాహుల్ 39 పరుగులు చేసి సోధీ బౌలింగ్లో శాంట్నార్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత బ్యాట్స్మెన్లలో ఎస్ఎన్ టాకూర్ (20), సౌనీ(11), విరాట్ కోహ్లీ(11), దుబే(12), సంజూ శాంసన్ (8), శ్రేయస్ అయ్యర్(1), ఛాహల్(1) పరుగులు చేశారు. వాషింగ్ టన్ సుందర్ డకౌట్ రూపంలో పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో సోధీ మూడు వికెట్లు పడగొట్టగా బెనిట్ రెండు వికెట్లు, కుగ్గేలెజిన్, శాంట్నార్, సౌథీ తలో ఒక వికెట్ తీశారు. ఇప్పటికే ఈ సిరీస్ను భారత్ 30 కైవసం చేసుకుంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/