నామినేషన్ వేసిన మన్మోహన్ సింగ్

జైపూర్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు జరుగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేశారు. జైపూర్లో ఆయన తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో మన్మోహన్ వెంట రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు ఉన్నారు. గత డిసెంబర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/