చిల్ట్రన్ న్యూట్రిషన్ పార్క్ను ప్రారంభించిన మోడి
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోడి రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్కు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రధాని ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవవ్రత్తో కలిసి నర్మదా జిల్లాలోని కెవాడియాలో పర్యటిస్తున్నారు. అక్కడ ఏక్తా మాల్ను, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా గుజరాత్ గవర్నర్, ముఖ్యమంత్రితో కలిసి న్యూట్రీ ట్రెయిన్లో చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్కులో ప్రయాణించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/