పారదర్శక పన్నుల విధాన వేదిక ప్రారంభించిన ప్రధాని

YouTube video
PM Modi launches platform for “Transparent Taxation – Honoring the Honest”

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఈరోజు ‘పారదర్శక పన్ను విధానం’ను  కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. నిజాయితీ ప‌న్నుదారుల‌కు మ‌రింత సులువైన విధానాన్ని తీసుకురానున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌న్నువిధానం అతుకులు లేకుండా, నొప్పి లేకుండా, ప‌న్నుదారుడు నేరుగా హాజ‌రు కాకుండా ఉండే విధంగా త‌యారు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ప‌న్నువిధానంలో భారీ సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌డుతున్న‌ట్లు చెప్పిన ప్ర‌ధాని.. నిజాయితీ ప‌న్నుదారుడు ఎటువంటి వేద‌న‌కు గురికాకుండా చూస్తామ‌న్నారు.

ఆదాయ‌ప‌న్ను, కార్పొరేట్ ప‌న్నుల‌ను త‌గ్గించిన‌ట్లు తెలిపారు. స‌క్ర‌మంగా ప‌న్నులు చెల్లిస్తున్న‌వారిని మ‌రింత్ ప్రోత్స‌హిస్తామ‌న్నారు. ప్ర‌త్యేక వేదిక ద్వారా ఫిర్యాదులు సులువుగా చేయ‌వ‌చ్చు అన్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి ప‌న్ను విధానంలో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకువ‌స్తున్న‌ట్లు తెలిపారు. పార‌దర్శ‌క ప‌న్నువిధానంలో ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ అతిపెద్ద సంస్క‌ర‌ణ అన్నారు. ఫేస్‌లెస్ అపీల్‌, ప‌న్నుదారుల ప‌ట్టిక కూడా సంస్క‌ర‌ణ‌లో భాగ‌మే అన్నారు.ఫేస్‌లెస్ అసెస్‌మెంట్‌, ట్యాక్స్ పేయ‌ర్ చార్ట‌ర్‌లు నేటి నుంచే అమ‌లులోకి వ‌స్తాయ‌న్నారు. ఫేస్‌లెస్ అపీల్ సేవ‌లు మాత్రం సెప్టెంబ‌ర్ 25 నుంచి అందుబాటులోకి రానున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/