జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపి గవర్నర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో 71 వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసులన గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతమ్ సవాంగ్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/