భారత్‌లో కరోనా కేసులపై కేంద్రం ప్రకటన

YouTube video
Press Briefing on the actions taken, preparedness and updates on COVID-19, Dated: 26.05.2020

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వివరాలను కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ విడుదల చేశారు. రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని.. ప్రస్తుతం 41.61 శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ భారత్‌లో 60,490 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలిపారు. కరోనా మరణాల సంఖ్య కూడా ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లో తక్కువగానే ఉందని చెప్పారు. భారత్‌లో కరోనా మరణాల రేటు ప్రస్తుతం 2.87 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా భారత్‌లో కరోనా టెస్టులకు సంబంధించి కూడా ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో రోజుకు 1,10,000 శాంపిల్స్‌ను టెస్ట్ చేస్తున్నట్లు ఐసీఎమ్‌ఆర్ ప్రకటించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/