రెండో రోజు ప్రారంభమైన ఏపి అసెంబ్లీ సమావేశాలు
అమరావతి: నేడు ఏపి అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి.అమ్మ ఒడి, రైతు భరోసా కేంద్రాలపై నేటి సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రత్యేక ఎస్సీ కమిషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. నిన్న జరిగిన సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా విశాఖపట్నం ఖరారైంది. హైకోర్టు కర్నూలుకు తరలిపోనుంది. శాసన రాజధానిగానే అమరావతి పరిమితం కానుంది. అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా.. జగన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/