ట్రంప్కు స్వాగతం పలికిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ భారత్కు విశిష్ట అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయనకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ లో సాదరంగా ఆహ్వానం పలికారు. అధికారిక స్వాగత కార్యక్రమంలో ట్రంప్ దంపతులు ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ సీనియర్ సలహాదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ను ఆహ్వానించేందుకు ప్రధాని మోడి, కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్, జయశంకర్ తదితరులు విచ్చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/