దేశంలో కొత్తగా 36, 011 కరోనా కేసులు
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, గత 24 గంటల్లో 36,011 మందికి కరోనా నిర్ధారణ అయింది.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,44,222 కి చేరింది.
అదే సమయంలో 482 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,40,182కి పెరిగింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/