కరోనా నుండి కోలుకున్న నవజాత శిశువు

newborn baby
newborn baby

అబూధాబీ: అబూధాబీలో కరోనా మహమ్మారిని జయించిన నవజాత శిశువు. అబూధాబీకి చెందిన మహిళ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, బిడ్డకు సహజంగా కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. ఒక్కరోజు బిడ్డకు కరోనా సోకడంతో మహిళ, ఆమె భర్త, కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. దీంతో వైద్యులు వెంటనే మహిళ భర్త, మరో ఇద్దరు పిల్లలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. రెండు వారాల పాటు తల్లీ, బిడ్డకు చికిత్స అందిస్తూ వచ్చామని.. తాజా ఫలితాల్లో కరోనా నెగిటివ్ వచ్చిందని వైద్యులు చెప్పారు. కాగా.. తన కొడుకును పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం చూడలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకును ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆమె తెలిపింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/