కెటిఆర్‌తో న్యూజిలాండ్‌ ఎంపి భేటీ

ట్విట్టర్ లో వెల్లడించిన కెటిఆర్‌

Minister KTR & Priyanca Radhakrishnan
Minister KTR & Priyanca Radhakrishnan

హైదరాబాద్‌: భారతదేశానికి చెందిన న్యూజిలాండ్‌ ఎంపి ప్రియాంక రాధాకృష్ణన్‌ బుధవారం తెలంగాణ మంత్రి కెటిఆర్‌ను కలిశారు. ఈ మేరకు కెటిఆర్‌ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేశారు. న్యూజిలాండ్ మహిళా ఎంపీ ప్రియాంక గారిని కలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ, న్యూజిలాండ్ మధ్య అనేక ఒప్పందాల కోసం చర్చించామని కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రియాంకను సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. కేటీఆర్ తో భేటీపై ప్రియాంక కూడా స్పందించారు. కేటీఆర్ తో సమావేశాన్ని ఎంతో ఆస్వాదించానని తెలిపారు. కేటీఆర్ ఎంతో సహృదయుడని, తమ మధ్య ఆహ్లాదకరమైన సంభాషణలు చోటుచేసుకున్నాయని వివరించారు. భారత రాజకీయ వ్యవస్థపైనా, అగ్రి టెక్నాలజీ, ఆవిష్కరణలు, స్టార్టప్ లు తదితర అంశాలపై చర్చించామని వెల్లడించారు. అంతేకాకుండా, న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ నాయకత్వంపై తామిద్దరికీ ఉన్న అభిమానం గురించి కూడా మాట్లాడుకున్నామని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/