ఢిల్లీలో వచ్చేనెల 3 ఉదయం వరకు లాక్డౌన్ పొడిగింపు
సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడి
New Delhi: ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ మే 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/