24 గంటల్లో 13,052 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 1,07,46,183
New Delhi: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,052 మంది కరోనా బారినపడ్డారు.
మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,46,183 కు చేరింది. అదే సమయంలో 127 మంది కరోనా కాటుకు మరణించారు. మృతుల సంఖ్య 1,54,274కు పెరిగింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/