తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ వెల్లడి
Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 317 మంది కరోనా బారిన పడ్డారు.
అదే సమయంలో ఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,84,391కి చేరింది.కరోనా మృతుల సంఖ్య 1,529కి పెరిగింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/