దేశంలో కొత్తగా 20వేల 346 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 1,03,95,278

New Delhi: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 20, 346 మందికి కరోనా సోకింది.
అదే సమయంలో కరోనా కాటుకు 222 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,03,95,278కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,50,336కు పెరిగింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/