దేశంలో కొత్తగా 1.34లక్షల కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,41,986
మొత్తం మృతుల సంఖ్య 3,37,989
హైదరాబాద్: భారత్ లో నిన్న 1,34,154 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాటి ప్రకారం… నిన్న 2,11,499 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,41,986కు చేరింది. మరో 2,887మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,37,989కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,63,90,584 మంది కోలుకున్నారు. 17,13,413 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 35,37,82,648 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 21,59,873 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/