కరెంట్‌ బిల్లు చెల్లింపుకు కొత్త యాప్‌!

కరెంట్ మీటర్ ఫొటో తీసి పంపితే బిల్ వచ్చేలా యాప్‌ ను రెడీ చేస్తున్న తెలంగాణ

electricity meters
electricity meters

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో కరెంట్ మీటర్ల రీడింగ్ నమోదును తెలంగాణ డిస్కమ్ లు వచ్చే నెలకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే కరెంట్‌ బిల్లు చెల్లించేందుకు తెలంగాణ ఉత్తర డిస్కమ్ ఓ ప్రత్యేక యాప్ ను త్వరలో అందుబాటులోకి తేనుంది. ఈ యాప్ ద్వారా మీటర్ రీడింగ్ ను ఫోటో తీసి పంపితే బిల్ జనరేట్ అవుతుందని డిస్కమ్ సీఎండీ అన్నమనేని గోపాలరావు వెల్లడించారు. వినియోగదారులు పాత బిల్ వచ్చిన తేదీ నుంచి సరిగ్గా 30 రోజులకు రీడింగ్ ను ఫొటో తీసి పంపితే బిల్ వస్తుందని, దాన్ని ఆన్ లైన్ లోనూ చెల్లించవచ్చని సూచించారు. కాగా, ఢిల్లీలో ఈ తరహా విధానం ఇప్పటికే అమలులో ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/