దేశంలో కొత్తగా 44,643 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,56,757
మొత్తం మృతుల సంఖ్య 4,26,754

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 44,643 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 41,096 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,56,757కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే… నిన్న 464 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,26,754కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,10,15,844 మంది కోలుకున్నారు. 4,14,159 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 49,53,27,595 వ్యాక్సిన్ డోసులు వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/