నేపాల్ విమానం అదృశ్యం..ఫ్లైట్‌లో 22 మంది

నేపాల్‌లో తారా ఎయిర్ 9 NAET ట్విన్-ఇంజిన్ విమానం అదృశ్యమైంది. ఆదివారం ఉదయం పోఖారా నుంచి నేపాల్‌లోని జోమ్‌సోమ్‌కు వెళ్తుండగా ఉదయం 9.55 గంటలకు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. విమానాన్ని ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో మొద‌ట‌ గుర్తించామ‌ని, త‌ర్వాత‌ మౌంట్ ధౌలగిరి వైపు మళ్లింద‌ని.. ఆ తర్వాతే ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు చెపుతున్నారు.

విమానంలో మొత్తం 22 మంది ఉన్నారు. అందులో నలుగురు భారతీయులు, జపాన్‌కు చెందిన వారు ముగ్గురు, సిబ్బందితో సహా 15 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. విమానం ఆచూకీ కోసం అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా “విమానం ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ఆకాశంలో కనిపించింది. తర్వాత మౌంట్ ధౌలగిరికి మళ్లించబడింది. ఆ తర్వాత దాంతో కమ్యూనికేషన్ తెగిపోయింది.” అని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ చెప్పారు.

గత ఏడాది మార్చిలో చైనాలోని గ్వాంగ్జి ప్రాంతంలో ఓ విమానం ప్రమాదం సభవించింది. చైనా ఈస్ట్రర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అదృశ్యమైంది. ఆ ఫ్లైట్ 132 మంది ప్రయాణికులతో కున్నింగ్ నుంచి గ్వాంగ్‌జౌకు బయల్దేరించింది. ఎయిర్‌పోర్ట్ అధికారులతో కమ్యూనికేషన్‌ తెగిపోయిన ఆ ఫ్లైట్ వుజౌ నగరానికి సమీపంలో అది కూలిపోయింది. దాంతో అందులో ఉన్న 132 మంది ప్రాణాలు కోల్పోయారు.