భారత్కు నేపాల్ ప్రభుత్వం లేఖ
భారత మీడియాలో వస్తోన్న వార్తలపై అభ్యంతరాలు
నేపాల్: నేపాల్ ప్రభుత్వం భారత్కు లేఖ రాసింది. భారత మీడియాలో వస్తోన్న కథనాలు తమ దేశ పౌరుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ నేపాల్ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ఇలాంటి కథనాల వల్ల ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలహీనమవుతాయని తెలిపింది. భారత మీడియాలో తమ దేశంపై వస్తున్న కథనాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని నేపాల్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఈ వార్తలు తమ దేశ రాజకీయ నేతలను అపఖ్యాతి పాలు చేసేలా ఉన్నాయని ఆరోపణలు గుప్పించింది. ఇలాంటి వార్తలను కట్టడి చేయాలని భారత్ను నేపాల్ సర్కారు కోరింది. నేపాల్లో డీడీ న్యూస్ మినహా భారతీయ న్యూస్ చానెళ్ల ప్రసారాలను నిలిపేస్తున్నట్లు నేపాలీ కేబుల్ టీవీ ప్రొవైడర్లు ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఈ లేఖ రాయడం గమనార్హం.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/