చైనా రాయబారి షాకిచ్చిన ప్రధాని ఓలి
ఖాట్మాండు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి చైనా రాయబారి హౌ యాన్కీకి షాకిచ్చారు. తన పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనే సామర్థ్యం తనకుందని, ఈ విషయంలో ఇతర దేశాల సహాయం తనకు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పడం ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. అధికార నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ)లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఓలికి సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం ఉంది. ఈ వర్గాన్ని మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ లీడ్ చేస్తున్నారు. తాను పార్టీలో చీలికకు కూడా సిద్ధమేనని ఓలి చెబుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే అది జరగకూడదని చైనా భావిస్తోంది. అవసరమైతే పార్టీలో చీలికను ఆపడానికి ఓలిని ప్రధాని పదవి నుంచి దించాలని కూడా చైనా భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చైనాపై ఓలి గుర్రుగా ఉన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/