సరోగసి వివాదం ఫై నయన్ భర్త విఘ్నేష్ స్పందన

Nayan gave birth to male twins
Nayan gave birth to male twins

నయనతార , విఘ్నేష్ శివన్ దంపతులు ఆదివారం అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపిన సంగతి తెలిసిందే. స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు మ‌గ క‌వ‌ల పిల్ల‌ల‌కు జన్మనిచ్చారు. ఈ విషయాన్నీ ప్రకటించిన దగ్గరి నుండి సోషల్ మీడియా లో అంత దీనిగురించి మాట్లాడుకుంటున్నారు. అయితే న‌య‌న‌తార స‌రోగ‌సి అంశంపై వివాదం నెల‌కొంది. తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో దీనిపై నయన్ భర్త విఘ్నేష్ స్పందించారు. తన ఇన్​స్టాలో ‘అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అప్పటివరకు ఓపికపట్టండి. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి’ అని రాశారు. ఇప్పుడీ పోస్ట్​ నెట్టింట వైరలవుతోంది.

ఇక నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెన్యుమరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా రికార్డు కూడా క్రియేట్ చేసుకుంది. ఇటీవలే మూడు ముళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు తల్లి పోస్ట్ కొట్టేసింది.