బిపిన్ రావ‌త్ దంపతుల భౌతిక కాయాలకు నివాళ్లు అర్పించిన మోదీ

బుధవారం భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో త్రివిద దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ , ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి భౌతిక కాయాలను గురువారం మధ్యాహ్నం మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సూలూర్ ఎయిర్ బేస్ కు తరలించారు. కొద్దీ సేపటి క్రితం సీడీఎస్ బిపిన్ రావ‌త్ దంప‌తుల తో పాటు ఆర్మీ అధికారుల భౌతిక కాయాలు ఢిల్లీ కి చేరుకున్నాయి. ఢిల్లీ లోని పాలం విమానాశ్ర‌యం లో ఆర్మీ అధికార‌లు, నేవీ అధికార‌లు తో పాటు ప్ర‌ధాని మోడీ, రాష్ట్రప‌తి నివాళ్లు అర్పించారు.

ఇక శుక్రవారం ఉద‌మం 11 గంట‌ల నుంచి సీడీఎస్ బిపిన్ రావ‌త్ దంప‌తుల భౌతిక కాయాల‌ను ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నకు ఉంచనున్నారు. ఆ తర్వాత 12:30 గంట‌ల నుంచి సైనికాధికారుల సంద‌ర్శ‌న కు అనుమ‌తి ఉంటుంది. అలాగే రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల కు ఢిల్లీ లో ని కామరాజ్ మార్గ్ నుంచి వీరి అంతిమ యాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత కంటోన్మెంట్ లో ని బ్రార్ స్క్వేర్ స్మ‌శ‌న వాటిక లో సైనిక లాంఛ‌నాల‌తో బిపిన్ రావ‌త్ దంపతుల అంత్య క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Prime Minister Narendra Modi pays last respects to CDS General Bipin Rawat, his wife Madhulika Rawat and other 11 Armed Forces personnel who lost their lives in the <a href=”https://twitter.com/hashtag/TamilNaduChopperCrash?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#TamilNaduChopperCrash</a> yesterday. <a href=”https://t.co/QT3JHKTedq”>pic.twitter.com/QT3JHKTedq</a></p>&mdash; ANI (@ANI) <a href=”https://twitter.com/ANI/status/1468966036372275213?ref_src=twsrc%5Etfw”>December 9, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>