నారాయణ బెయిల్ రద్దు పిటీషన్ విచారణ ఈ నెల 24న

బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ఏపీ స‌ర్కారు పిటిష‌న్‌
విచార‌ణ‌కు స్వీక‌రించిన చిత్తూరు కోర్టు

అమరావతి: టీడీపీ సీనియ‌ర్ నేత, మాజీ మంత్రి నారాయ‌ణకు మంజూరైన బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ ఏపీ ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను చిత్తూరు జిల్లా కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈ పిటిష‌న్‌పై ఈ నెల 24న విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది. అంతేకాకుండా ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై స్పందించాలంటూ నారాయ‌ణ‌కు కోర్టు నోటీసులు జారీచేసింది.

టెన్త్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారంలో ప‌ట్టుబ‌డిన వారంతా నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌కు చెందిన‌వారేన‌న్న ప్రాథమిక స‌మాచారంతో… ఆ విద్యా సంస్థ‌ల చైర్ ప‌ర్స‌న్ హోదాలో ఉన్నారంటూ నారాయ‌ణ‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మాల్ ప్రాక్టీస్ కేసులో సంబంధం లేని సెక్ష‌న్ల‌ను న‌మోదు చేశారంటూ రిమాండ్‌కు త‌ర‌లించ‌కుండానే నారాయ‌ణ‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను ర‌ద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో ఏపీ ప్ర‌భుత్వం పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/