14 వ రోజుకు చేరిన నారా లోకేష్ యాత్ర

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారానికి 14 వ రోజుకు చేరింది. నేడు జీడీ నెల్లూరు నియోజకవర్గం ఆత్మకూరులోని ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ముత్యాలమ్మ గుడిలో లోకేష్ ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం మూర్తినాయకనపల్లి చర్చిలో ప్రార్థనలను నిర్వహించారు. మధ్యాహ్నం సంసిరెడ్డిపల్లెలో భోజన విరామం తీసుకుంటారు. ఇప్పటి వరకు లోకేష్ పాదయాత్ర 155.5 కిలోమీటర్లు కొనసాగింది. నిన్న ఆయన 9.6 కిలోమీటర్లు నడిచారు.

ఈరోజు లోకేష్ షెడ్యూల్ చూస్తే..

ఉదయం 8 గంటలకు ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి పాదయాత్ర మొదలైంది. 8.05 గంటలకు ఆత్మకూరు ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసారు. 8.25 గంటలకు మూర్తినాయకనపల్లి చర్చిలో ప్రార్థనలు చేయడం జరిగింది. 9.20 గంటలకు కడపగుంట ఎస్సీ కాలనీలో ఎస్సీలతో ముఖాముఖి సమావేశం అయ్యారు.

11 గంటలకు మహదేవ మంగళంలో స్థానికులతో మాటామంతీ.
12.35 గంటలకు సంసిరెడ్డిపల్లెలో భోజన విరామం.
1.35 గంటలకు సంసిరెడ్డిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
మధ్యాహ్నం 2.25 గంటలకు జీడీ నెల్లూరు ఐజడ్ఎం స్కూలులో విద్యార్థులతో భేటీ.
2.55 గంటలకు అవలకొండలో కొత్తగా నిర్మించిన దర్గా ప్రారంభం.
సాయంత్రం రంగాపురం క్రాస్ వద్ద బహిరంగసభలో ప్రసంగం.
6.10 గంటకు రేణుకాపురం విడిది కేంద్రంలో బస చేయనున్నారు.