ఇప్పటి వరకు 497 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నటితో ఆయన 38 రోజులు సక్సెస్ ఫుల్ గా యాత్ర పూర్తి చేసారు. అలాగే ఈరోజు తో 497 కిలోమీటర్లు లోకేష్ నడిచారు. నాలుగు రోజులగా లోకేష్ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో యాత్ర సాగించిన లోకేష్.. ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈరోజు ఉదయం చింతపర్తిలోని బోయపల్లి క్రాస్ వద్ద పాదయాత్ర ప్రారంభమయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్యాంప్ సైట్ లో మహిళలకు పాదాభివందనం చేసిన లోకేష్… వారితో సమావేశమై ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం మహిళలు పెద్దఎత్తున యువనేతకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు.

మహిళా దినోత్సవం సందర్భంగా లోకేష్ మహిళలకు పాదాభివందనం చేసారు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళలేనని.. అమ్మ లేనిదే మనకు జన్మ లేదు అని ఈ సందర్భాంగా అన్నారు. అమ్మలేకపోతే మనకు జన్మలేదని, భూమి కన్నా ఎక్కువ భారం మహిళలు మోస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేజీ నుండి పీజీ వరకూ మహిళల గొప్పతనం, వారు పడే కష్టాలు తెలిసేలా ప్రత్యేక పాఠ్యాంశాలు పెడతాం. మహిళా మంత్రులే మహిళల్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారని, మహిళా మంత్రి రోజా నాకు చీర, గాజులు పంపుతాను అన్నారు. మహిళలు అంటే వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని ప్రశ్నించారు. జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేదు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 52 వేల మహిళల పై వేధింపులు జరిగాయి. మరో 900 మంది మహిళల పై అత్యాచారాలు జరిగాయి. సిఎం సొంత నియోజకవర్గం లో నాగమ్మ అనే మహిళ పై అత్యాచారం జరిగితే పోరాడిన దళిత మహిళా నాయకురాలు అనిత పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని లోకేష్ గుర్తుచేశారు.

ఆ తర్వాత పాదయాత్ర జమనపల్లి వద్దకు చేరుకోగానే బాణాసంచా మోతలతో దద్దరిల్లింది. చింతలవారిపల్లిలో మహిళలు యువనేతకు ఎదురేగి హారతులిచ్చి స్వాగతం పలికారు. విటలం గ్రామంలో యువనేతపై పూలవర్షం కురిపించి బాజాభజంత్రీలతో తమ గ్రామంలోకి ఆహ్వానించారు. మధ్యాహ్నం పునుగుపల్లిలో భోజన విరామానంతరం పాదయాత్ర వాయల్పాడు చేరుకున్న సమయంలో అక్కడి ప్రజలు యువనేతకు నీరాజనాలు పలికారు. వాయల్పాడు పట్టణంలో దారిపొడవునా యువతీయువకులు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు రోడ్లవెంట బారులు తీరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు.