మంగళగిరి లో వైస్సార్సీపీ నేత ఇంటికి వెళ్లిన నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి లో ని వైస్సార్సీపీ కీలక నేత ఇంటికి వెళ్లారు. బాదుడే బాదుడు కార్యక్రమం లో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటించారు. దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో స్దానిక నేతలతో కలసి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నాను. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.

ఈ క్రమంలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ నేత, దుగ్గిరాల మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్ వెనిగళ్ళ శ్రీ కృష్ణ ప్రసాద్ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. లోకేష్ వెంట పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. జగన్ పాలనలో పెరిగిన పన్నుల భారం, నిత్యావసర సరుకుల ధరలు గురించి ప్రజలకు వివరించారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు పెంచడం, ఆర్టీసి ఛార్జీలు వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు.