హైకోర్టు తీర్పుపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. ప్రభుత్వ భవనాలకు, కార్యాలయాలకు పార్టీ రంగులు తొలంగించాలని ఏపి హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ పలు విధాలు విమర్శలు చేశారు. చెడు పై మంచి గెలిచిన రోజున రంగులు చల్లుకొని హోలీ జరుపుకుంటాం. అదే హోలీ రోజున ప్రభుత్వ భవనాలకు వైకాపా వేసిన రంగులు చెరిపేయాలని కోర్టు తీర్పివ్వడం చెడు పై మంచి సాధించిన విజయం అని అన్నారు. పేద వాడికి అన్నం పెట్టడానికి మనసొప్పలేదు. 1400 కోట్ల ప్రజాధనం పోసి వేసిన రంగులు చెరిపేందుకు మరో 1400 కోట్లు? ఇదేనా రివర్స్ పాలన? అంటూ మరో ట్వీట్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/