రివర్స్లో జగన్ పాలన అంటున్న నారా లోకేశ్
ట్విట్టర్లో ఓ పత్రిక కథనం పోస్టు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై టిడిపి నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు అంతా నాశనమవుతోందని అన్నారు. ఆయన పాలనలో పనులన్నీ రివర్స్ గా జరుగుతున్నాయని ట్వీట్ చేశారు. ‘వృద్ధి రేటు తిరోగమనం చెందుతోంది. అభివృద్ధి తలకిందులైంది. ఉద్యోగాలు పోతున్నాయి. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలను ఉపసంహరించుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని కూడా రివర్స్. వైఎస్ జగన్ హయాం.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తిరోగమన కాలంగా నిలిచిపోతుంది’ అని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా ఓ ఆంగ్ల పత్రికలో ఏపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వచ్చిన కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/