పాదయాత్రలో దేవాన్ష్ ఫ్లెక్సీ చూసి లోకేష్ ఆశ్చర్యం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోకేష్ యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. లోకేష్ పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నారా దేవాన్ష్, జేసీ బ్రదర్స్ మనవడు ధీర్ రెడ్డితో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

అందులో ‘ మా నాన్నలు నలభైలో ఉన్నారు.. వాళ్ల స్థితే అధ్వాన్నంగా ఉంటే.. 10లో ఉన్నాం మా పరిస్థితేంటో?’ అంటూ ఇద్దరి ఫోటోలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రేపటి బాగు కోసం కదలిరండి అని పిలుపునిచ్చారు. ఈ ఫ్లెక్సీని చూసిన లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేసి నవ్వుకున్నారు. కాగా నేడు లోకేష్ యాత్ర 68 వ రోజుకు చేరింది. జిల్లాలోని రాయలచెరువులో బుధవారం జరిగే బహిరంగసభలో లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా.. లోకేష్ పాదయాత్ర, బహిరంగసభను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం పార్టీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.