జైల్లో ఉన్న రైతులను పరామర్శించిన లోకేశ్‌

రోడ్డు దిగ్బంధం కేసులో అరెస్టయిన రైతులు

Nara Lokesh
Nara Lokesh

గుంటూరు: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 27 రోజులుగా జరుగుతున్న నిరసనలు ఇప్పటికీ ఆగలేదు. కొన్నిచోట్ల ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. రోడ్డు దిగ్బంధం కేసులో రైతులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జైలులో వున్న 19 మంది రాజధాని రైతులను టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఈ రోజు పరామర్శించారు. గుంటూరు జిల్లా జైలుకు వెళ్లి రైతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రైతులను అడ్డుకుని ఉద్యమం అణచివేయాలని ప్రభుత్వం భావిస్తోందని మండిపడ్డారు. జేఏసీ నేతలపైనా ఇష్టం వచ్చినట్టు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/