ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి సిద్ధంగా ఉన్నారు : లోకేష్

మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు: జగన్ వ్యాఖ్యలకు నారా లోకేశ్ సెటైర్

అమరావతి: సీఎం జగన్ నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా తన వెంట్రుక కూడా పీకలేవని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా నారా లోకేశ్ స్పందిస్తూ… గల్లీ నుంచి ఢిల్లీ వరకు పనికిమాలినోడని తేలిపోయిన తర్వాత ఫ్రస్టేషన్ కాకపోతే ఏమొస్తుందని ఎద్దేవా చేశారు. ‘వెంట్రుక మహరాజ్, ఈకల ఎంపరర్ జగన్ గారూ… మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు’ అని ఎద్దేవా చేశారు.

మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో తాము పని చేస్తున్నామని లోకేశ్ అన్నారు. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘నా మాట విని మీరే గుండు కొట్టించుకోండి. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం’ అని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/